బజాజ్ ఆటో ప్రపంచ రికార్డు.. ట్రిలియన్ మార్క్ ను దాటేసిందిగా..!
- కరోనా కాలంలోనూ.. ప్రపంచ మార్కెట్ ను శాసించిన బజాజ్ ఆటో..!
కరోనా కాలంలోనూ దేశీయ ఆటో దిగ్గజం ప్రపంచ రికార్డును సాధించి అందరి ప్రశంసలను అందుకుంటోంది. బజాజ్ ఆటో కంపెనీ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ మార్క్ ను దాటేసింది.
తద్వారా ప్రపంచంలోనే లక్ష కోట్ల కోట్ల మార్కెట్ విలువ కలిగిన తొలి కంపెనీగా బజాజ్ ఆటో చరిత్ర సృష్టించింది. బజాజ్ ఆటో త్రిచక్ర వాహన రంగంలో టాప్ ప్లేస్ కొనసాగుతూనే ద్విచక్ర వాహనంలో నెంబర్ స్థానాన్ని దక్కించుకుంది.
కొత్త ఏడాది తొలిరోజున బజాజ్ ఆటో కంపెనీ షేర్ విలువ ఎన్ఎస్ఈలో ఒక శాతం పెరిగి రూ.3,479 వద్ద ముగిసింది. దీంతో బజాజ్ ఆటో మార్కెట్ విలువ ఒక లక్షా ఆరువందల డెబ్బై కోట్లను అధిగమించి ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. అన్ని కంపెనీల మాదిరిగానే బజాజ్ ఆటో షేర్ కూడా పతమైంది. అయితే ఏడాది చివరి నాటికి 11శాతం పెరిగింది.
బజాజ్ ఆటో భారత్ మార్కెట్ తోపాటు విదేశీ మార్కెట్ పై దృష్టిసారించింది. కొంతకాలంగా ఆటోరంగం క్షీణించినప్పటికీ ఎగుమతులు పెరగడంతో వృద్ధిని నమోదు చేసుకుంది.
పల్సర్.. బాక్సర్.. ప్లాటినా తదితర బజాజ్ ఆటోకు చెందిన బ్రాండ్లను అంతర్జాతీయంగా 70దేశాల్లో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది నుంచి థాయ్లాండ్.. ఆ తర్వాత బ్రెజిల్లోనూ బజాజ్ ఆటో వాహనాలను విక్రయించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
బజాజ్ ఆటో కంపెనీ కొత్త ఏడాదిలో ట్రిలియన్ మార్క్ ను దాటేయగా.. ఆ తర్వాత హీరోమోటో కార్ప్ దాదాపు 62వేల28కోట్ల మార్కెట్ కలిగి ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ విలువ 69వేల730కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
బజాజ్ ఆటో ఇప్పటికే త్రిచక్ర.. దిచక్ర వాహన రంగంలో టాప్ ప్లేసులో కొనసాగుతుండగా మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలపై తయారీపై కూడా దృష్టిసారిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ బజాజ్ ఆటో సత్తాచాటాలని ఉవ్విళ్లురుతోంది.
0 Comments